హైదరాబాద్, నవంబర్27 (నమస్తే తెలంగాణ): నాయీబ్రాహ్మణుల సంక్షేమానికి అన్నివిధాలుగా అండగా నిలుస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ వెంటే నాయీబ్రాహ్మణ సమాజం ఉండాలని నాయీబ్రాహ్మణ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బాలకృష్ణ ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు.
నాయీబ్రాహ్మణుల సంక్షేమానికి బీఆర్ఎస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని కొనియాడారు. సెలూన్లకు 250 యూనిట్ల కరెంటును ఉచితంగా ఇస్తున్నదని, సెలూన్ల ఆధునికీకరణ, ఏర్పాటు కోసం లక్ష ఆర్థిక సాయాన్ని అందజేస్తున్నదని, కులవృత్తిపై ఆధునిక శిక్షణను ఇప్పిస్తున్నదని తెలిపారు.