హైదరాబాద్లోని బస్ భవన్లో ఏర్పాట్లు
డిచ్పల్లి, సెప్టెంబర్ 19: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ ఆర్టీసీ) చైర్మన్గా నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ సోమవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. హైదరాబాద్లోని బస్భవన్లో ఇందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమం లో పలువురు ప్రముఖులు పాల్గొన నున్నారు. తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత ఆర్టీసీ చైర్మన్గా నియమితులైన రెండో వ్యక్తిగా బాజిరెడ్డి గోవర్ధన్ నిలిచారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో సీనియర్ శాసనసభ్యుడిగా పేరున్న ఆయనను రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ చైర్మన్గా నియమించింది. ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొనడానికి నిజామాబాద్ జిల్లాకు చెందిన టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, ఆయన అభిమానులు భారీ సంఖ్యలో హైదరాబాద్కు తరలివెళ్లనున్నారు.