నిజామాబాద్, సెప్టెంబర్ 16 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): టీఎస్ ఆర్టీసీ చైర్మన్గా నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ను నియమిస్తున్నట్టు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ప్రకటించారు. టీఎస్ఆర్టీసీ తొలి చైర్మన్గా సోమారపు సత్యనారాయణ పనిచేయగా, తదుపరి అవకాశం బాజిరెడ్డికి దక్కింది. 1981లో సర్పంచ్గా రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన బాజిరెడ్డి 1999లో తొలిసారిగా శాసనసభకు ఎన్నికయ్యారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేగా 1999లో ఆర్మూర్ నుంచి, 2004లో బాన్సువాడ నుంచి ప్రాతినిధ్యం వహించారు. 2009లో ప్రస్తు త స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత టీఆర్ఎస్లో చేరి 2014 ఎన్నికల్లో పీసీసీ మాజీ అధ్యక్షుడు డీ శ్రీ నివాస్ను ఓడించారు. 2018లో నాలుగోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. బాజిరెడ్డి స్వస్థలం నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం చీమన్పల్లి .
టీఎస్ఆర్టీసీ చైర్మన్గా నియమించిన సీఎం కేసీఆర్కు ధన్యవాదాలు. నాపై నమ్మకంతో ఈ పదవిని కట్టబెట్టినందుకు సంతోషంగా ఉన్నది. ఆర్టీసీ చైర్మన్గా పదవికి న్యాయం చేస్తా. సీఎం కేసీఆర్ మార్గదర్శకంలో ఆర్టీసీని ముందుకు తీసుకుపోయేందుకు కృషిచేస్తాను.
బాజిరెడ్డి గోవర్ధన్, టీఎస్ఆర్టీసీ నూతన చైర్మన్