నాంపల్లి కోర్టులు, డిసెంబర్ 22 (నమస్తే తెలంగాణ): బిగ్బాస్ సీజన్-7 విజేత గొడుగు పల్లవి ప్రశాంత్తోపాటు సోదరుడు గొడుగు మహవీర్ అలియాస్ పరశురాంకు షరతులతో కూడిన బెయిన్ మంజూరయ్యింది. ఈ మేరకు 17వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ సాయిసుధ శుక్రవారం తీర్పును వెలువరించారు. రూ.15 వేల సొంత పూచీకత్తుపై ఇద్దరి చొప్పున జమానత్లను కోర్టుకు సమర్పించాలని ఉత్తర్వులో పేర్కొన్నారు.
ప్రతి ఆదివారం జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్లో హాజరు కావాలని షరతు విధించారు. డ్రైవర్లు శాంతి సాయికిరణ్, అంకిరావులపల్లి రాజుకు సైతం బెయిల్ మంజూరు చేశారు. వీరిద్దరూ రూ.5 వేల చొప్పున కోర్టుకు జమ చేయాలని పేర్కొన్నారు. పోలీసులు దాఖలు చేసిన పిటిషన్లను పరిశీలించిన కోర్టు 12 మంది నిందితుల రిమాండ్కు ఆదేశించింది.