ములుగు : కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో గిరిజనులు మోసపోయారని బీఆర్ఎస్ పార్టీ ములుగు నియోజకవర్గ ఇన్చార్జి బడే నాగజ్యోతి విమర్శించారు. మంగళవారం ఆమె మీడియా సమావేశంలో మాట్లాడారు. ఎస్టీ డిక్లరేషన్ పేరిట కాంగ్రెస్ పార్టీ గిరిజనలను మోసం చేసిందన్నారు. ఇచ్చిన హామీలను విస్మరించి నిలువునా మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
గత ప్రభుత్వంలో గిరిజన రిజర్వేషన్లను 6 శాతం నుండి 10 శాతానికి కేసీఆర్ పెంచిన విషయాన్ని గుర్తు చేశారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో గ్రామాలను తండాలను పంచాయతీలుగా ఏర్పాటు చేసి స్వయంపాలన కల్పించారన్నారు. సెప్టెంబర్ 17న ప్రతి గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ర్యాలీలు నిర్వహించి సంబురాలు చేయాలి అని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.