కాపాడి దవాఖానకు తరలించిన ఎస్సై
నాగర్కర్నూల్, ఆగస్టు 22: గుర్తుతెలియని వ్యక్తులు ఓ ఆడ శిశువును డంపింగ్ యార్డులో పడేయగా ఎస్సై కాపాడి దవాఖానకు తరలించారు. నాగర్కర్నూల్ జిల్లా కేంద్రం సమీపంలోని చందాయిపల్లి వద్ద ఏర్పాటు చేసిన చెత్త డంపింగ్ యార్డులో ఆదివారం మధ్యాహ్నం ఓ శిశువు అరుపులు వినిపించగా.. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. వెంటనే ఎస్సై విజయ్కుమార్ డంపింగ్ యార్డు వద్దకు వెళ్లి శిశువును తన వాహనంలో జిల్లా దవాఖానకు తరలించారు. పరీక్షించిన వైద్యులు శిశువుకు వైద్యసేవలు అందించారు. ప్రస్తుతం క్షేమంగా ఉన్నట్టు పేర్కొన్నారు.