నాగర్ కర్నూల్ : జిల్లా కేంద్రంలోని జనరల్ ఆసుపత్రి సర్జరీ గదిలోని బాత్రూంలో శిశువు మృతదేహం కలకలం సృష్టించింది. సోమవారం రాత్రి ఈ సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. సోమవారం ప్రసవం కోసం వచ్చిన మహిళల్లో అందరి శిశువులు ఆరోగ్యంగా ఉండగా, ఈ మృత శిశువు ఎవరి బిడ్డ అనేది ప్రశ్నార్థకంగా మారింది. బాత్రూంలో డ్రైనేజీ నీళ్లు పేరుకుపోవడంతో గమనించిన శానిటేషన్ సిబ్బందికి మృత శిశువు కనిపించింది. దీంతో వైద్యాధికారులకు సమాచారం అందించారు. కాగా, శిశువు మృతదేహం బాత్రూంలోకి ఎలా వచ్చిందనేదానిపై ఆరా తీస్తున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.