మోర్తాడ్, మార్చి 1: మహారాష్ట్రలోని బాబ్లీ ప్రాజెక్ట్ నుంచి శుక్రవారం 0.6 టీఎంసీల నీటిని గోదావరిలోకి విడుదల చేశారు. తాగునీటి కోసం మార్చి ఒకటిన నీటిని విడుదల చేయా లని గతంలో సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
ఈ మేరకు శుక్రవారం కేంద్ర జల వనరుల సంఘం పర్యవేక్షణలో బాబ్లీ నుంచి నీటిని దిగువకు వదిలారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 2.75 టీఎంసీలు ఉన్నది.