కేంద్ర బృందం అధికారుల ఆధ్వర్యంలో నీటి విడుదల
మెండోరా/ బాసర, జూలై 1: మహారాష్ట్రలోని బాబ్లీ ప్రాజెక్టు గేట్లు తెరుచుకొన్నాయి. శుక్రవారం ఉదయం 8 గంటలకు సెంట్రల్ వాటర్ కమిషన్ అధికారుల ఆధ్వర్యంలో గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు.
ఈ సందర్భంగా ఎస్సారెస్పీ ఈఈ చంద్రశేఖర్ మాట్లాడుతూ.. బాబ్లీ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 2.7 టీఎంసీలు కాగా ప్రాజెక్టులో ప్రస్తుతం ఒక టీఎంసీ నీరుందన్నారు. సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం ప్రాజెక్టు 14 గేట్లను ఎత్తి గోదావరిలోకి నీటిని విడుదల చేసినట్టు తెలిపారు. ఎస్సారెస్పీలో ప్రస్తుతం నీటి మట్టం 1066.90 అడుగులు కాగా 23.432 టీఎంసీల నీటి నిల్వ ఉన్నదని తెలిపారు.