హైదరాబాద్, ఏప్రిల్ 14 (నమస్తే తెలంగాణ) : బీజేపీకి ఎన్నికల సమయంలో హామీలు ఇవ్వటం ఎంత సులభమో, వాటిని మరచిపోవడం కూడా అంతే సులభమని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్ ఎద్దేవా చేశారు. బీజేపీ కొత్త మ్యానిఫెస్టో గురించి మాట్లాడే ముందు ఆ పార్టీకి ధైర్యం ఉంటే 2014 మ్యానిఫెస్టో గురించి మాట్లాడాలని ఆయన ఒక ప్రకటనలో సవాల్ విసిరారు. 2014లో విదేశాల్లో ఉన్న నల్లధనాన్ని దేశానికి తీసుకొచ్చి ప్రతి ఒకరి ఖాతాలో రూ.15 లక్షలు వేస్తాం అని చెప్పిన బీజేపీ దాని గురించి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. 2019 ఎన్నికల సమయంలో రైతులకు వడ్డీ లేకుండా రూ. లక్ష రుణాలు ఇస్తామని చెప్పారని, రాష్ట్రంలో ఎంత మంది రైతులకు వడ్డీలేని రుణాలు కేంద్రం నుంచి ఇచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు.
ప్రతీ ఎన్నికల సందర్భంగా భారత్ను ఫుడ్ ప్రాసెసింగ్ హబ్గా మారుస్తాం చెప్పటం బీజేపీకి ఫ్యాషన్గా అయిపోయిందని మండిపడ్డారు. 2019లో రైతుల కోసం బడ్జెట్లో ప్రత్యేకంగా రూ. 25 లక్షల కోట్ల కేటాయిస్తాం అని చెప్పిన బీజేపీ 5 సంవత్సరాలలో ఎన్ని లక్షల కోట్లు కేటాయించారో చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రతి కుటుంబానికి పకా ఇల్లు అని పేర్కొన్న బీజేపీ ఈసారి కొత్తగా మూడు కోట్ల మందికి పక్కా ఇల్లు వాగ్దానం చేస్తున్నారంటే గతంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేదని ఒప్పుకున్నట్టేనని ఆయన ఎద్దేవా చేశారు. 2019లో ప్రతి కుటుంబానికి వంట గ్యాస్ అని చెప్పి ఇప్పుడూ అదే చెప్తున్నారని ఆయన మండిపడ్డారు. తెలంగాణలోని దేవాలయాల కోసం కేంద్రం నుంచి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఎన్ని నిధులు తెచ్చారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. 2019లో వన్మిషన్, వన్ డైరెక్షన్ అంటే 2024లో వన్ నేషన్ వన్ఎలక్షన్ అని కొత్తపలుకు పలుకుతుందన్నారు. రాష్ట్రంలో మాములు రైళ్లకే దికు లేదని, బుల్లెట్ రైలు అని పేర్కొనటం సిగ్గుచేటన్నారు. 2024 బీజేపీ మ్యానిఫెస్టోలో తమిళ భాషని విశ్వవ్యాప్తం చేస్తామని పేర్కొన్నారు సరే, మరి తెలుగు భాషా ఏం పాపం చేసిందని ప్రశ్నించారు.