నిర్మల్ : స్వతంత్ర భారత వజ్రోత్సవాలు తెలంగాణ వ్యాప్తగా ఘనంగా కొనసాగుతున్నాయి. ముఖ్రా కే గ్రామ పరిధిలోని పంట పొలాల్లో జాతీయ జెండాలను రైతులు రెపరెపలాడించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో తాము ఆనందంగా ఉన్నామని రైతులు తెలిపారు. వ్యవసాయానికి 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్, రైతుబంధు, రైతుబీమా లాంటి పథకాలు అమలు చేసి, రైతుల జీవితాలను మార్చారని కొనియాడారు. అనంతరం గ్రామంలో జాతీయ జెండాలను చేతబూని ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్రా కే గ్రామ సర్పంచ్ గాడ్గె మీనాక్షి, ఎంపీటీసీ గాడ్గె సుభాష్, ఉప సర్పంచ్ వర్షతో పాటు సంజీవ్, మాధవ్, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.