హైదరాబాద్, జూలై 13 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర వైద్యారోగ్యశాఖలో మరో ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలైంది. ఆయుష్ విభాగంలో 156 మె డికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు (ఎంహెచ్ఎస్ఆర్బీ) గురువారం నోటిఫికేషన్ జారీ చేసింది. ఆయుర్వేద విభాగంలో 54, హోమియోలో 33, యునానిలో 69 పోస్టులను భర్తీ చేయనున్నట్టు తెలిపింది.
ఈ పోస్టులకు వచ్చే నెల 7 నుంచి 22 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్టు వెల్లడించిం ది. అభ్యర్థుల వయోపరిమితి 18 నుంచి 44 ఏం డ్లు ఉండాలని పేర్కొన్నది. ప్రభుత్వ దవాఖానల్లో, విద్యాసంస్థల్లో పనిచేసినవారికి గరిష్ఠంగా 20 పాయింట్లు వెయిటేజీ కల్పిస్తారు. గిరిజన ప్రాం తాల్లో పనిచేసినవారికి ప్రతి 6 నెలల సర్వీస్కు 2.5 మార్కులు, గిరిజనేతర ప్రాంతాల్లో పనిచేసినవారికి 2 మార్కులు కేటాయిస్తారు.
ఆయుష్లో మెడికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నో టిఫికేషన్ వెలువడిన సందర్భంగా వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు హర్షం ప్రకటించారు. రాష్ట్రంలో కొలువుల జాతర కొనసాగుతున్నదని ట్వీట్ చేశారు. వైద్యారోగ్య శాఖలో ఇప్పటికే పలు విభాగాల్లో పోస్టు ల భర్తీ ప్రక్రియ చేపట్టామని గుర్తు చేశారు.