డెలివరీల్లో జోగుళాంబ గద్వాల జిల్లా అయిజ పీహెచ్సీ రికార్డు సృష్టించింది. మంగళవారం ఉదయం 8 నుంచి బుధవారం ఉదయం 8 వరకు (24 గంటల్లో) ఈ పీహెచ్సీలో 8 కాన్పులు జరిగాయి. డాక్టర్ హేమ మానస పర్యవేక్షణలో అందరికీ సాధారణ ప్రసవాలే జరిగాయి. తల్లీబిడ్డలు ఆరోగ్యంగా ఉండగా.. కేసీఆర్ కిట్లు అందజేసి 102 వాహనంలో వారి ఇండ్లకు పంపినట్టు పీహెచ్సీ వైద్యాధికారి విష్ణు తెలిపారు.
-అయిజ