హైదరాబాద్ : ఉద్యోగ ఖాళీల భర్తీ పై ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్ర శేఖర్ రావు బుధవారం అసెంబ్లీలో ప్రకటన చేశారు. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పోటీ పరీక్షలపై అవగాహన సదస్సులు నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలంగాణ గ్రూప్ -1 అధికారుల సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మామిండ్ల చంద్ర శేఖర్ గౌడ్, హన్మంతు నాయక్ ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లా కేంద్రాలలోని ఆడిటోరియాలలో, జిల్లా గ్రంథాలయాల్లో గ్రూప్- 1, గ్రూప్ -2 స్థాయి అధికారులతో ఈ సదస్సులు నిర్వహించనున్నట్లు, ఈ అవకాశాన్ని నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని వారు తెలిపారు.