హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 8 (నమస్తే తెలంగాణ): ఈ నెల 20, 21 తేదీల్లో ప్రభుత్వ విద్యాసంస్థల్లో సైబర్ సేఫ్టీ బూట్ క్యాంప్ నిర్వహించనున్నట్టు తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ (టీఎస్ఐసీ) ప్రతినిధి ఒక ప్రకటనలో తెలిపారు. ఆరో తరగతి నుంచి ఇంటర్మీడియట్ విద్యార్థుల వరకు భాగస్వామ్యంతో ఈ శిబిరాలు నిర్వహిస్తామని తెలిపారు. డిజిటలైజేషన్ నేపథ్యంలో సైబర్ సెక్యూరిటీకి ఎంతో ప్రాధాన్యం నెలకొన్నదని, భద్రతతో కూడిన కార్యకలాపాల కోసం అవగాహన కల్పించేలా ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా చేపడుతున్నట్టు పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు (http://bit.ly/ TelanganaCyberLearnerPermitProgram) లింకులో సంప్రదించి పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు.