వరంగల్ : సీఎం కేసీఆర్ దళితబాంధవుడని, దళితుల జీవితాల్లో పెనుమార్పులు తీసుకువస్తున్నారని ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీలకు వంద యూనిట్ల వరకు ఉచిత కరెంటు ఇస్తున్న నేపథ్యంలో 18, 19, 20, 21 డివిజన్లకు చెందిన వారితో సీబీసీ చర్చ్ వద్ద నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దళితుల ఆర్థిక స్వావలంభన కోసం దళితబంధు, వంద యూనిట్ల ఉచిత కరెంటు, ఎస్సీ సబ్ప్లాన్ ఓవర్సీస్ స్కాలర్ షిప్ కార్యక్రమాలు అమలు చేస్తున్నారన్నారు. దళితులు, బహుజనులు ఆర్థిక పరిపుష్టి సాధించాలని రాష్ట్రంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకువచ్చారన్నారు.
వంద యూనిట్ల ఉచిత కరెంటును సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రతీ ఒక్కరికీ అందే వరకు కొనసాగుతుందని, విడుదల వారీగా దళితబంధు అందజేస్తారన్నారు. సీబీసీ చర్చ్ అభివృద్ధి కృషి చేస్తామని, ఇప్పటికే పలుమార్లు నిధులు కేటాయించామని, ఇంకా అభివృద్ధి చేసేందుకు సహకారం అందిస్తామన్నారు. ఎన్నికలప్పుడు వచ్చే నాయకులతో ఒరిగేదేం లేదని, పేద ప్రజల బాగు కోసం చాలా ఓపికగ్గా పని చేస్తున్నామన్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా అభివృద్ధి చేసి చూపిస్తున్నామని, సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ సహకారంతో నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తామన్నారు.