హైదరాబాద్, ఫిబ్రవరి 12 (నమస్తే తెలంగాణ): మేడారం సమ్మక- సారక జాతరపై తెలంగాణ జాగృతి రూపొందించిన డాక్యుమెంటరీని శనివారం ఎమ్మెల్సీ కవిత హైదరాబాద్లోని తన నివాసంలో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం కళాకారులను ప్రోత్సహించటానికి అనేక కార్యక్రమాలు చేపట్టిందని పేర్కొన్నారు. ఆసియాలోనే అతిపెద్ద గిరిజన ఆదివాసీ జాతరపై ప్రత్యేక డాక్యుమెంటరీ రూపొందించిన ఫిల్మ్ మేకర్ బాలాజీ దూసరిని ఆమె అభినందించారు. అనంతరం పద్మశ్రీ సకిని రామచంద్రయ్యను ఎమ్మెల్సీ కవిత సతరించారు. అంతరించిపోతున్న కళను బతికించడానికి రామచంద్రయ్య చేస్తున్న కృషి మరువలేనిదని కొనియాడారు. సమ్మక సారక జాతరకు, రామచంద్రయ్యకు ప్రత్యేక అనుబంధం ఉన్నదని తెలిపారు. రామచంద్రయ్య డోలు వాయిద్యం మోగితేనే ఆదివాసీ గిరిజన ఆరాధ్యదైవాలు జనప్రవేశం చేస్తారని ఆమె వెల్లడించారు. ప్రభుత్వం అన్ని విధాలా సహకారం అందిస్తున్నదని సకిని రామచంద్రయ్య వెల్లడించారు. కార్యక్రమంలో ప్రభుత్వ విప్ రేగా కాంతారావు, తెలంగాణ జాగృతి జనరల్ సెక్రటరీ నవీనాచారి, ఉపాధ్యక్షుడు మేడే రాజీవ్సాగర్, జాగృతి రాష్ట్ర కార్యదర్శి మఠం భిక్షపతి, సాంసృతిక విభాగం కన్వీనర్ కోదారి శ్రీను, రంగారెడ్డి అధ్యక్షురాలు అర్చన, మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు సంతోష్ తదితరులు పాల్గొన్నారు.