CM KCR | భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహేబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయన పేరిట ఏటా అవార్డులను ఇవ్వనున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు ప్రకటించారు. అంబేద్కర్ విగ్రహావిష్కరణ అనంతరం బహిరంగ సభలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కత్తి పద్మారావు అంబేద్కర్ పేరిట శాశ్వతమైన అవార్డును నెలకొల్పితే బాగుంటుందని సూచించారని కేసీఆర్ తెలిపారు.
ఈ మేరకు అంబేద్కర్ పేరిట అవార్డులు ఇచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం వెంటనే ఆదేశాలిస్తామన్నారు. రూ.51కోట్లు డిపాజిట్ చేస్తామని ప్రకటించారు. దేశం, రాష్ట్రంలో ఉన్న వారికి అంబేద్కర్ పేరిట జయంతి రోజున అవార్డులు ఇస్తామన్నారు. రూ.51కోట్ల నిధి శాశ్వత నిధి ఉంటుందన్నారు. సంవత్సరానికి 3 కోట్ల వడ్డీ వస్తుంది. దాంతో దేశం, రాష్ట్రంలో ఉన్న వారికి ఉత్తమ సేవలందించిన వారికి అంబేద్కర్ జయంతి రోజున అవార్డులు అందజేస్తాం. 50 కోట్ల నిధి శాశ్వతంగా ఉంటుందన్నారు.