హైదరాబాద్ ఏప్రిల్ 18 (నమస్తే తెలంగాణ): సీఎం కేసీఆర్ దార్శనికత, సమర్థ నిర్ణయాలను క్షేత్రస్థాయిలో పకడ్బందీగా అమలు చేయటం వల్లే కేంద్రం అవార్డులు ఇస్తుందని రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ అన్నారు. సీఎం కేసీఆర్ అందిస్తున్న సుపరిపాలన ఫలితంగానే రాష్ర్టానికి అవార్డులు వస్తున్నాయని తెలిపారు. అవార్డు అందుకొన్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావుతోపాటు స్థానిక ప్రజాప్రతినిధులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు.