హైదరాబాద్, నవంబర్ 17 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ నుంచి హజ్ యాత్రకు బయలుదేరే ప్రదేశం బెస్ట్ ఎంబార్కేషన్ పాయింట్ అవార్డుకు ఎంపికైంది. ఢిల్లీలో గురువారం నిర్వహించిన కార్యక్రమంలో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ చేతులమీదుగా ఆ అవార్డును హజ్కమిటీ చైర్మన్ మహ్మద్ సలీం స్వీకరించారు. అవార్డు రావడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఇండియా హజ్కమిటీ చైర్మన్ అబ్దుల్లా కుట్టి, సీఈవో యాకూ బ్ షేక్, తెలంగాణ హజ్కమిటీ సీఈవో షఫియుల్లా, ఈవో ఇర్ఫాన్ షరీఫ్ తదితరులు పాల్గొన్నారు.