సుల్తాన్బజార్,నవంబర్ 9. ఉస్మానియా మెడికల్ కళాశాల ఐఎస్వో 21001 గుర్తింపు దక్కింది. ఈ మేరకు శుక్రవారం కోఠిలోని ఉస్మానియా వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ శశికళారెడ్డికి ఐఎస్వో సంస్థ ప్రతినిధి శివయ్య ఐఎస్వో 21001 గుర్తింపు పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ శశికళారెడ్డి మాట్లాడుతూ రెండు తెలుగు రాష్ర్టాల్లో ఏ వైద్య కళాశాలకు దక్కని గుర్తింపు మొదటిసారి ఉస్మానియా మెడికల్ కళాశాలకు లభించడం గర్వకారణమని అన్నారు.
కళాశాలలో అందిస్తున్న నాణ్యమైన విద్యా ప్రమాణాలు, భద్రత, సామర్థ్యం, కళాశాలలోని గ్రీన్ ఎన్విరాన్మెంట్, అధ్యాపకుల విద్యా బోధన, ఉద్యోగుల సమిష్టి కృషితోనే ఈ గుర్తింపు లభించిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ కిరణ్మయి, డాక్టర్ జయ, ఫిజియాలజీ హెచ్వోడీ డాక్టర్ పద్మిని, ప్రొఫెసర్లు పద్మావతి, అనిత, ఎంపీహెచ్ఈవో వేణుగోపాల్గౌడ్ తదితరులు పాల్గొన్నారు.