హైదరాబాద్, ఆగస్టు 4 (నమస్తే తెలంగాణ): ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కార్టూనిస్ట్స్ ఆధ్వర్యంలో 2020 సంవత్సరానికి జాతీయస్థాయిలో నిర్వహించిన మాయా కామత్ మెమోరియల్ కార్టూన్ అవార్డ్స్ పోటీలో ‘నమస్తే తెలంగాణ’ కార్టూనిస్ట్ మృత్యుంజయకు ‘స్పెషల్ జ్యూరీ అప్రిసియేషన్’ అవార్డు లభించింది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ నిరసన తెలుపుతున్న అన్నదాతలకు మద్దతుగా హర్యానా పూజారి ఆత్యహత్య చేసుకున్న ఘటనపై మృత్యుంజయ గీసిన ఈ కార్టూన్కు నగదు పారితోషికంతోపాటు జ్ఞాపికను అందించనున్నామని ఐఐసీ మేనేజింగ్ ట్రస్టీ వీజీ నరేంద్ర తెలిపారు.