హైదరాబాద్, డిసెంబర్ 9 (నమస్తే తెలంగాణ): తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలోని శ్రీవేంకటేశ్వర ఆర్ట్స్ కళాశాలకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) పదేండ్ల పాటు అటానమస్ (స్వయంప్రతిపత్తి) హోదా కల్పించింది. కళాశాలకు అటానమస్ హోదా లభించడానికి కృషి చేసిన టీటీడీ జేఈవో సదా భార్గవి, విద్యాశాఖాధికారి డాక్టర్ ఎం భాసర్రెడ్డి, కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ టీ నారాయణమ్మ, కళాశాల అధ్యాపక బృందాన్ని టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్రెడ్డి, ఈవో ఏవీ ధర్మారెడ్డి ప్రత్యేకంగా అభినందించారు.
స్వయంప్రతిపత్తి కల్పించడంతో కళాశాల అభివృద్ధికి స్వతహాగా నిర్ణయాలు తీసుకునే అవకాశంతోపాటు విద్యావిధానం, పరీక్షల నిర్వహణ, పోటీ ప్రపంచాన్ని ఎదురొనేలా సిలబస్లో మార్పులు చేసుకోవడానికి వీలవుతుంది. దీంతోపాటు సామాజిక సేవా దృక్పథంతో విద్యాబోధన, ఆధునిక సాంకేతికత ఆధారంగా కోర్సుల నిర్వహణ, మెమరీబేస్డ్ విద్యావిధానం ఏర్పాటుకు వెసులుబాటు కలుగుతుంది. క్యాంపస్ సెలక్షన్స్కు ప్రపంచ స్థాయి సంస్థలు ముందుకు వస్తాయి.