మల్కాజిగిరి, ఫిబ్రవరి 20: ఆర్థిక ఇబ్బందులు భరించలేక తల్లితోసహా ఆటోడ్రైవర్ ఆత్మహత్య చేసుకున్నాడు. మల్కాజిగిరి ఠాణా పరిధిలో రెండ్రోజుల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చిం ది. పోలీసుల వివరాల ప్రకారం.. నిజామాబాద్కు చెందిన స్వరూప (55)కు ఇద్దరు కుమారులు రవి, శ్రీకాంత్ (35) ఉన్నారు. శ్రీకాంత్ ఆటోను కిరాయికి తీసుకొని నడిపిస్తుండేవాడు. వ్యసనాలకు బానిసై అప్పులు చేశాడు. నిజామాబాద్లో అప్పులిచ్చినవారి ఒత్తిడి పెరగడంతో తల్లితోసహా హైదరాబాద్కు వచ్చాడు. శ్రీకాంత్కు కొన్నేండ్ల క్రితం వివాహం కాగా, భార్య అతడిని విడిచి వెళ్లింది. మలక్పేటలో శ్రీకాంత్ కిరాయికి క్యాబ్, ఆటో నడిపించాడు. అక్క డా అప్పులు చేసి మల్కాజిగిరికి వచ్చారు. పటేల్నగర్లో ఏడాదిన్నరగా ఉంటున్నారు. రెండ్రోజులుగా వీరి ఇంటి తలుపులు తెరవకపోవడంతో ఇంటి యజమానికి అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశా డు. వారొచ్చి తలుపులను పగులగొట్టి చూడగా ఇంటి కప్పు రాడుకు చీరతో తల్లి, కుమారుడు ఉరివేసుకొని కనిపించారు. రెండు రోజుల క్రితమే ఆత్మహత్య చేసుకున్నట్టు అనుమానిస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం గాంధీ దవాఖానకు తరలించారు. అన్న రవి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు జరుపుతున్నారు.