ఉప్పల్, ఫిబ్రవరి 1 (నమస్తే తెలంగాణ): ఆంధ్రా మీల్స్ సెంటర్పై స్పందించిన సీఎం రేవంత్రెడ్డి తెలంగాణ ఆటో డ్రైవర్ల సమస్యలను పట్టించుకోకపోవడం విచారకరమని తెలంగాణ ఆటోయూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు వేముల మారయ్య ఆవేదన వ్యక్తంచేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఆటోడ్రైవర్ల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వ నిర్ణయంతో ఎంతోమంది ఆటోడ్రైవర్లు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. ఆటోడ్రైవర్లను ప్రభుత్వం ఆదుకోకపోతే జీవితాలు రోడ్డున పడుతాయని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రభుత్వం స్పందించకుంటే ఆటోకార్మికులతో కలిసి ఉద్యమిస్తామని హెచ్చరించారు.