మెట్పల్లిలో ఆటో, జీపు డ్రైవర్ల ఆందోళన
మెట్పల్లి, మే 16: వాహనాల ఫిట్నెస్ రెన్యూవల్పై కేంద్రం రోజుకు రూ.50 జరిమానా విధింపును వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఆటో, జీపు వాహన యూనియన్ల డ్రైవర్లు సోమవారం ఆందోళన బాటపట్టారు.
జగిత్యాల జిల్లా మల్లాపూర్, మెట్పల్లి, ఇబ్రహీంపట్నం మండలాలకు చెందిన ఆటో, జీపు, టాటా మ్యాజిక్ వాహనాల రాకపోకలను బంద్ చేశారు. మెట్పల్లి పట్టణంలోని డ్రైవర్లు అంబేద్కర్ మినీ స్టేడియం నుంచి ర్యాలీగా పాత బస్టాండ్కు చేరుకొని జాతీయ రహదారిపై బైఠాయించారు. దీంతో ఇరువైపుల భారీగా వాహనాలు నిలిచిపోయాయి.