హిమాయత్నగర్/కామారెడ్డి, జనవరి 24: యాభై ఏండ్లు నిండిన ఆటో డ్రైవర్లకు సామాజిక పింఛన్లు ఇవ్వాలని తెలంగాణ ఆటో, రిక్షా డ్రైవర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీ వెంకటేశం, ఏఐటీయూసీ నగర ప్రధాన కార్యదర్శి కమతం యాదగిరి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హైదరాబాద్ హిమాయత్నగర్లోని ఎస్ఎన్రెడ్డి భవన్లో బుధవారం జరిగిన యూనియన్ నగర కౌన్సిల్ సమావేశంలో వారు మాట్లాడారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో రాష్ట్రంలోని సుమారు 7 లక్షల మంది ఆటో డ్రైవర్లు తీవ్రంగా నష్టపోతున్నారని, వారందరికీ ప్రత్యామ్నాయ మార్గాలు చూపాలని కోరారు. ఇదిలా ఉండగా, ఆటో యూనియన్ ఐక్యకార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో బుధవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో భారీ ర్యా లీ నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా 20 వేల మంది ఆటో డ్రైవర్లు ఉన్నారని తెలిపారు.