నాగర్కర్నూల్ : జిల్లాలోని వెల్దండ మండలం పెద్దాపూర్ గ్రామ శివారులో ఆటో, బొలేరో వాహనం ఢీ కొన్న సంఘటనలో ఒకరు మృతి చెందగా మరో ఆరుగురికి తీవ్రగాయాలు అయ్యాయి . హైదరాబాద్- శ్రీశైలం జాతీయ రహదారిపై పెద్దాపూర్ గ్రామ శివారులో గల ఇండియన్ పెట్రోల్ బంకు వద్ద ప్రమాదం జరిగింది.
కల్వకుర్తి నుంచి కడ్తాల వెళుతున్న డీసీఎం వ్యాన్ పెట్రోల్ బంకు నుంచి జాతీయ రహదారిపై కి వస్తున్న టీవీఎస్ ఎక్స్ ఎల్ ను తప్పించబోయి హైదరాబాద్ నుంచి వస్తున్న ఆటోను ఢీకొట్టింది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న నలుగురు, టీవీఎస్ ఎక్సెల్ పై ఉన్న ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడ్డ వారిని కల్వకుర్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఒకరు మృతి చెందారు.