హైదరాబాద్, ఏప్రిల్ 14 (నమస్తే తెలంగాణ) : మహారాష్ట్రలోని ఔరంగబాద్ పట్టణం బీఆర్ఎస్కు జై కొట్టింది. తెలంగాణ మాడల్ మహారాష్ట్రలో ప్రభంజనం సృష్టిస్తున్నది. తెలంగాణలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు మహారాష్ట్రలో కూడా కావాలని ఆ రాష్ట్ర ప్రజలు ఆశిస్తున్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలోనే అది సాధ్యమని నమ్ముతున్న వివిధ పార్టీలకు చెందిన నేతలు బీఆర్ఎస్లో చేరుతున్నారు. ఔరంగబాద్లో శుక్రవారం పీయూసీ చైర్మన్ జీవన్రెడ్డి, బోధన్ ఎమ్మెల్యే షకీల్, ఐడీసీ చైర్మన్ ఎస్ వేణుగోపాలాచారి, ఔరంగాబాద్ బీఆర్ఎస్ నేతలు హర్షవర్ధన్ జాదవ్, అభయ్పాటిల్, ఖదీర్ మలానా, దిలీప్గోరే, అంకిత్యాదవ్, శివాజీ యాదవ్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు.
పార్టీలో చేరినవారికి జీవన్రెడ్డి గులాబీ కండువాలు కప్పి ఆహ్వానించారు. బీఆర్ఎస్లో చేరినవారిలో ఔరంగాబాద్ తాలుకా ప్రెసిడెంట్ నితీశ్ రాథోడ్, బంజారా బ్రిగేడ్ జిల్లా అధ్యక్షుడు ఛత్రపతి ముఖేశ్ రాథోడ్, ఉపాధ్యక్షులు సంతోష్రాథోడ్, లల్లా రాథోడ్, వినోద్హాన్, ప్రేమ్దాస్ రాథోడ్, మహరాష్ట్ర జయ సంఘర్ష్ వెహికిల్ డ్రైవర్స్ ఓనర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్ హల్నర్, వైస్ ప్రెసిడెంట్ అబ్బాస్ ఖాన్, కమిటీ సభ్యులు రమేశ్ కోల్తే, రవింద్రఫడే, సోమనాథ్ గైక్వాడ్, రవీంద్ర అడావ్, జ్ఞానేశ్వర్ హల్నర్, మానవహిత్ లోక్షాహీ పార్టీ సంఘటన్ జిల్లా అధ్యక్షుడు కృష్ణ గైక్వాడ్, బజాజ్నగర్కు చెందిన అశోక్ సిర్సట్, కృష్ణ గైక్వాడ్, జ్యోతివాటౌర్ తదితరులున్నారు.