వరంగల్, జూన్ 25: కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ నిర్వహించిన ఓ-సిటీ ప్లాట్ల వేలంపాటలో కమర్షియల్కు గజానికి రూ.1,10,000 అత్యధిక ధర పలికింది. ఆదివారం 12వ విడుత ఓ-సిటీ ప్లాట్ల వేలంలో ప్లాట్ల కొనుగోలుకు పాటదారులు పోటీలు పడ్డారు. కుడా అధికారులు 42 ప్లాట్లకు వేలం నిర్వహించ గా.. 40 ప్లాట్లు హాట్కేకుల్లా అమ్ముడుపోయాయి. 36 రెసిడెన్షియల్ ప్లాట్లకు వేలం నిర్వహించగా 34 అమ్ముడుపోయాయి. రెసిడెన్షియల్ ప్లాట్లలో గజానికి రూ. 85,500 ఆత్యధిక ధర పలికింది. వరంగల్ కలెక్టర్, కుడా వైస్ చైర్మ న్ ప్రావీణ్య, కుడా చైర్మన్ సుందర్రాజ్ యాదవ్, కుడా చీఫ్ ప్లానింగ్ అధికారి అజిత్రెడ్డిలు వేలం పాట నిర్వహించారు.