హైదరాబాద్ : తెలంగాణకు పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతూనే ఉంది. తాజాగా మరో భారీ పెట్టుబడి వచ్చింది. అట్టారో ఇండియా కంపెనీ తెలంగాణలో భారీ పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చింది. ఈ విషయాన్ని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. అట్టారో ఇండియా కంపెనీ తెలంగాణలో రూ. 600 కోట్ల భారీ పెట్టుబడి పెట్టబోతోందని, ఈ విషయాన్ని ప్రకటించేందుకు సంతోషిస్తున్నానని కేటీఆర్ తన ట్వీట్లో పేర్కొన్నారు. ఈ పెట్టుబడి ద్వారా 300 మందికి పైగా ప్రత్యక్ష ఉపాధి లభించనుంది. పరోక్షంగా చాలా మంది ఉపాధి లభించనుందని తెలిపారు.
Happy to announce that @AtteroIndia will be investing Rs 600 Crores to establish a a new facility in Telangana
The proposed facility will provide direct employment to more than 300 people and indirect employment to many more pic.twitter.com/qaxbTlHapf
— KTR (@KTRTRS) October 31, 2022