హైదరాబాద్, మే 17 (నమస్తే తెలంగాణ) : ఇంటర్ విద్య, సాంకేతిక విద్య పరిధిలోని కాలేజీల్లో బుధవారం నిర్వహించిన లైబ్రేరియన్ల పరీక్షకు 55 శాతం అభ్యర్థులు హాజరైనట్టు టీఎస్పీఎస్సీ కార్యదర్శి అనితారామచంద్రన్ తెలిపారు. ఉదయం 2,663 (55.59శాతం), మధ్యాహ్నం 2,650 (55.32శాతం) మంది అభ్యర్థులు పరీక్షలు రాసినట్టు వెల్లడించారు. మూడు జిల్లాలోని 17 పరీక్షాకేంద్రాల్లో 71 లైబ్రేరియన్ పోస్టుల భర్తీకి పరీక్ష నిర్వహించినట్టు పేర్కొన్నారు.