హైదరాబాద్ : కాంగ్రెస్ పాలనలో అక్రమ ఇసుక రవాణా( Sand transportation) యథేచ్ఛగా కొనసాగుతున్నది. ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్న వారిపై దాడులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. చివరికి సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth reddy) సొంత నియోజకవర్గంలో పోలీసులకు కూడా రక్షణ లేకుండాపోయింది. అక్రమ ఇసుక రవాణానను అడ్డకున్న హోంగార్డుపై(Home guard) ఎస్ఆర్వో ఆంజనేయులుదౌర్జన్యం చేశాడు.
వివరాల్లోకి వెళ్తే..వికారాబాద్(Vikarabad) జిల్లాలోని వికారాబాద్ – మద్దూర్, కొత్తపల్లి లింగల్చేడ్ వాగులో విధులు నిర్వహిస్తున్న ఎస్ఆర్వో ఆంజనేయులు తన స్వగ్రామమైన దోరేపల్లిలో అధికారుల అండదండలతో వాగు నుంచి ఇసుకను తరలిస్తున్నాడు. అయితే అదే సమయంలో అటుగా వెళ్తున్న హోంగార్డు ఇసుకను తరలిస్తున్న ట్రాక్టర్ను అడ్డుకున్నాడు.
దీంతో ఎస్ఆర్వో ఇసుక ట్రాక్టర్ అడ్డుకోవడానికి నువ్వు ఎవరంటూ ప్రశ్నించడమే కాకుండా దుర్భాషలాడుతూ హోంగార్డు కాలర్ పట్టుకొని దౌర్జన్యం చేశాడు. అతడి చేతిలో ఉన్న సెల్ ఫోన్ పగులగొట్టాడు. అంతే కాకుండా ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో అంటూ ట్రాక్టర్ను అక్కడి నుంచి తప్పించాడు. వివరాలు తెలియాల్సి ఉంది.
సీఎం సొంత నియోజకవర్గంలో పోలీసులకు రక్షణ కరువు
అక్రమ ఇసుక అడ్డకున్న హోంగార్డుపై దౌర్జన్యం చేసిన ఎస్ఆర్వో
వికారాబాద్ – మద్దూర్, కొత్తపల్లి లింగల్చేడ్ వాగులో విధులు నిర్వహిస్తున్న ఎస్ఆర్వో ఆంజనేయులు తన స్వగ్రామమైన దోరేపల్లిలో అధికారుల అండదండలతో వాగు నుంచి ఇసుకను తరలిస్తున్నాడు.… pic.twitter.com/k8XF0JQWBz
— Telugu Scribe (@TeluguScribe) April 11, 2024