హైదరాబాద్, ఫిబ్రవరి 20 (నమస్తే తెలంగాణ): ఢిల్లీ అశోక్రోడ్ ప్రాంతంలోని ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఆదివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు జరిపిన ఈ దాడిలో కిటికీ అద్దాలు ధ్వంసమయ్యాయి. ఇంటి లోపలా.. ఆవరణలో రాళ్లు పడి ఉన్నాయి. తన ఇంటిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారని అసదుద్దీన్ ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఎంపీ ఇంటిని ఢిల్లీ అడిషనల్ డీసీపీ పరిశీలించారు. అసద్ ఇంటిపై గుర్తుతెలియని వ్యక్తులు రాళ్లు విసిరారని, సీసీ కెమెరా ఫుటేజీని, ఇంటి పరిసరాలను పరిశీలించామని, కేసు దర్యాప్తు కొనసాగుతున్నదని ఆయన తెలిపారు.