ఆత్మకూరు, ఆగస్టు 25 : లంచం తీసుకుంటూ వనపర్తి జిల్లా ఆత్మకూరు రెవెన్యూ ఇన్స్పెక్టర్ శుక్రవారం ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. ఏసీబీ డీఎస్పీ శ్రీకృష్ణాగౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. ఆత్మకూరులోని గాంధీనగర్కు చెందిన జానకీరాములు దాయాదులకు చెందిన రెండెకరాల 26 గుంటల భూమిని బదలాయింపు చేయించేందుకు ఆర్ఐ నర్సింహులును సంప్రదించారు.
ఆయన రూ.10 వేలు లంచం డిమాండ్ చేయగా అంత ఇచ్చుకోలేనని జానకీరాములు చెప్పడంతో చివరకు రూ.5 వేలకు అంగీకరించాడు. ఆ మేరకు జానకీరాములు శుక్రవారం ఆర్ఐని కలిసి డబ్బు ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. కేసు నమోదు చేసి ఆర్ఐ నర్సింహులును అదుపులోకి తీసుకున్నారు.