హైదరాబాద్, అక్టోబర్27 (నమస్తే తెలంగాణ): తమ అభ్యున్నతికి, సంక్షేమానికి అహర్నిశలు కృషి చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్కు, బీఆర్ఎస్ పార్టీకి దివ్యాంగులంతా మద్దతుగా నిలవాలని రాష్ట్ర దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ వాసుదేవరెడ్డి పిలుపునిచ్చారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గెలుపే ధ్యేయంగా రాష్ట్రవ్యాప్తంగా ఆత్మీయ సమ్మేళనాలను, సీఎం కృతజ్ఞత సభలను నిర్వహించనున్నట్టు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. మొదటి విడతలో 27 రోజుల్లో 51 నియోజకవర్గాల్లో ఈ సమావేశాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. గడిచిన తొమ్మిదిన్నరేండ్లుగా బీఆర్ఎస్ ప్రభుత్వం దివ్యాంగుల సంక్షేమానికి చేపట్టిన కార్యక్రమాలను వివరిస్తామని, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల గెలుపునకు మద్దతు కూడగడతామని పేర్కొన్నారు.