హైదరాబాద్ : రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ చైర్మన్ గా నియమితుడైన సర్దార్ రవీందర్ సింగ్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్ ఎర్రమంజిల్ లోని తెలంగాణ సివిల్ సప్లై భవన్ లో మంత్రులు కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్,
పోలీస్ హౌసింగ్ చైర్మన్ కోలేటి దామోదర్ గుప్తా సమక్షంలో బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా మంత్రులతో పాటు పలువురు రవీందర్ సింగ్కు శుభాకాంక్షలు తెలిపారు.