హైదరాబాద్: ఉభయ సభలు ప్రారంభమయ్యాయి. నాలుగో రోజైన నేడు శాసనసభ, శాసన మండలిలో బడ్జెట్పై సాధారణ చర్చ జరుగనుంది. అనంతరం మంత్రి హరీశ్ రావు సమాధానం ఇవ్వనున్నారు. ఈ నేపథ్యంలో శాసనసభలో ప్రశ్నోత్తరాలను రద్దుచేశారు. నేరుగా బడ్జెట్పై చర్చను ప్రారంభించనున్నారు. కాగా, మాజీ శాసనసభ్యులు వెలిచాల జగపతిరావు, మందాడి సత్యనారాయణ రెడ్డి, గడ్డం రుద్రమదేవి మృతిపట్ల స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు. దీంతో సభ్యులు రెండు నిమిషాల పాటు మౌనం పాటించి సంతాపం తెలిపారు.