హనుమకొండ : అస్సాం ముఖ్యమంత్రి ఎక్కడైనా ఆగి రైతులతో మాట్లాడి సీఎం కేసీఆర్ రైతులకు అందిస్తున్న రైతుబంధు, రైతు బీమా గురించి అడిగి తెలుసుకోండి. బీజేపీ నాయకులకు చిత్తశుద్ధి ఉంటే చారిత్రక నగరం హనుమకొండకి వచ్చే ముందు విభజన చట్టంలో పేర్కొన్న అంశాలు నెరవేర్చిన తరువాత నగరంలో అడుగు పెట్టండని ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్ అన్నారు.
బీజేపీ నాయకులు హనుమకొండ సందర్శనకు వస్తున్న సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. హనుమకొండ నగర అభివృద్ధిని వీక్షించేందుకు విచ్చేస్తున్న బీజేపీ కేంద్ర నాయకత్వానికి, అస్సాం ముఖ్యమంత్రి హిమంత్ బిశ్వా శర్మ గారికి స్వాగతం.
వరంగల్ బీజేపీ నాయకులను సూటిగా ప్రశ్నిస్తున్నా. మీరు మీ కేంద్ర నాయకత్వాన్ని సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను చూపించేందుకు అహ్వానిస్తున్నారా అని ప్రశ్నించారు. ఇదే హేమంత్ బిశ్వా శర్మ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఇదే బీజేపీ పార్టీ వాళ్లు కేసులు పెట్టి జైలుపాలు చేసిన విషయం గుర్తుంచుకోవాలన్నారు.
దేశం మొత్తం గర్వించేలా సీఎం కేసీఆర్ సుపరిపాలన చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడకముందు రైతాంగం పరిస్థితి దారుణంగా ఉండేదన్నారు. బీజేపీ నాయకులకు నగరం మీద ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా విభజన చట్టంలో పొందుపర్చిన కాజీపేట కోచ్ ప్యాక్టరీ, ట్రైబల్ యూనివర్సిటీ, ఉక్కు ప్యాక్టరీ తీసుకురావాలన్నారు.
తెలంగాణ రాష్ట్ర సాధనకై ప్రాణాలు సైతం లెక్క చేయని ఆనాటి ఉద్యమ నేత నేటి ముఖ్యమంత్రి కేసీఆర్ని దుషిస్తే సహించేది లేదన్నారు. శాంతి భద్రతలకు ఎలాంటి ఆటంకాలు కలిగించినా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.