హైదరాబాద్, మార్చి 15 (నమస్తే తెలంగాణ): తెలంగాంలో ఫీకల్ స్లడ్జ్ ట్రీట్మెంట్ ప్లాంట్ల (ఎఫ్ఎస్టీపీ) నిర్వహణకు ఆధునిక సాంకేతికతను వినియోగించేందుకు అస్కి, కోవిస్ట్రో సంస్థ లు ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. సీడీఎంఏ సత్యనారాయణ సమక్షంలో బుధవారం జరిగిన కార్యక్రమంలో అస్కి తరఫున ప్రొఫెసర్ శ్రీనివాసచా రి, కోవిస్ట్రో కంపెనీ ఇంక్లూజివ్ బిజినెస్ హెడ్ వీరలక్ష్మణ్ ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం మాత్రం దేశంలోనే తొలిసారి ప్రతి పట్టణంలో ఒకటి చొప్పున ఎఫ్ఎస్టీపీలను నిర్మిస్తున్నది. నీటి శుద్ధి తర్వాత వెలువడే వ్యర్థాలతో బయో సాలిడ్స్ను తయారు చేసేందుకు ప్రత్యే క టెక్నాలజీని ఉపయోగిస్తున్నది. రాష్ట్రంలో ఎఫ్ఎస్టీపీలకు నాలెడ్జ్ పార్టనర్గా అస్కి వ్యవహరిస్తుండగా.. పాలిమర్స్ తయారీలో ప్రపంచ ఖ్యాతి పొందిన కోవిస్ట్రో వివిధ దేశాల్లో పలు సంస్థలకు సాంకేతిక సహకారాన్ని అందిస్తున్నది. నిరుడు ఈ సంస్థ రూ.1,571 కోట్ల టర్నోవర్ సాధించింది.