తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతున్నది. కుమ్రం భీం జిల్లాలోని ఆసిఫాబాద్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి కోవా లక్ష్మి ఆధిక్యంలో ఉన్నారు. రెండో రౌండ్లో కోవా లక్ష్మికి 6,492 ఓట్లు రాగా, కాంగ్రెస్ అభ్యర్థి శ్యామ్ నాయక్కు 5,256 ఓట్లు, ఇండిపెండెంట్ అభ్యర్థి విజయ్ 2716 ఓట్లు వచ్చాయి. మొత్తంగా బీఆర్ఎస్ 2015 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు.