మెదక్ అర్బన్, జనవరి 26 : సీపీఆర్తో ఓ వ్యక్తి నిండు ప్రాణాన్ని కాపాడారు ఏఎస్సై. మెదక్ జిల్లా హవేళీఘనపూర్ పోలీస్స్టేషన్ పరిధిలోని శమ్నపూర్ గ్రామానికి చెందిన చింతామని భూదమ్మ అనారోగ్యంతో బాధపడుతున్నది. కొడుకులకు భారం కావద్దనే ఉద్దేశంతో శుక్రవారం బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నది. విషయం తెలియడంతో హవేళీఘనపూర్ ఏఎస్సై రాజు సంఘటన స్థలానికి చేరుకున్నారు.
అదే సమయంలో మృతురాలు భూదమ్మ కొడుకు బైరయ్య గుండెపోటుకు గురై కుప్పకూలిపోయాడు. అక్కడే ఉన్న ఏఎస్సై రాజు సమయస్ఫూర్తితో సీపీఆర్ చేసి ప్రాణాలు నిలబెట్టారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం బైరయ్యను దవాఖానకు తరలించారు. సీపీఆర్ చేసి వ్యక్తిని కాపాడిన ఏఎస్సైని ఎస్పీ అభినందించారు.