Asifabad | జైనూర్, మార్చి 25: ప్రభుత్వ బాలికల ఆశ్రమ పాఠశాల నుంచి ఆదివారం రాత్రి అక్రమంగా తరలిస్తున్న బియ్యాన్ని విద్యార్థినులు సాహసోపేతంగా పట్టుకున్నారు. కు మ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండ లం పట్నాపూర్లోని బాలికల ఆశ్రమ పాఠశాలలో 300 మందికిపైగా విద్యార్థినులు చదువుకుంటున్నారు.
మూడు రోజుల నుం చి రోజూ అర్ధరాత్రి 12 గంటల ప్రాంతంలో ఆటోలో రాగోజీ అనే వ్యక్తి ఆశ్రమ పాఠశాల బియ్యాన్ని తీసుకెళ్తున్నాడు. దీనిని విద్యార్థినులు గమనిస్తున్నారు. ఆదివారం అర్ధరాత్రి 12 గంటలకు కూడా 15 బస్తాల (ఒక్కో బస్తా 50 కిలోలు)ను ఆటోలో వేస్తున్నాడు. దీనిని గుర్తించిన కొందరు విద్యార్థినులు ప క్కా ప్రణాళికతో సాహసం చేసి అడ్డుకున్నా రు.
కేకలు వేయడంతో గ్రామస్థులు జమ అ య్యారు. ఇంతలో ఆటోడ్రైవర్ రాగోజీ పారిపోగా.. పట్టుకున్న ఆటోను హాస్టల్లోనే ఉం చారు. ఈ విషయమై ఏటీడీవో పురుషోత్తం ను వివరణ కోరగా.. తనకు ఇప్పుడే తెలిసిందని తెలిపారు. ప్రిన్సిపాల్ పరశురాంను అ డుగగా.. ఆరు క్వింటాళ్ల బియ్యాన్ని లో నుపై తీసుకున్నామని, ఆ బియ్యాన్ని వాప సు పంపిస్తున్నామని తెలిపారు.