లండన్ : బీఆర్ఎస్ మేనిఫెస్టో దేశ సంక్షేమానికే దిక్సూచి. బీఆర్ఎస్ మేనిఫెస్టో తో వార్ వన్ సైడ్ అయిందని ఎన్నారై బీఆర్ఎస్ యూకే అధ్యక్షుడు అశోక్ గౌడ్ దూసరి ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ మేనిఫెస్టో తెలంగాణ ప్రజలందరికి ఒక భరోసా, ఒక అండ అని తెలిపారు. ఉద్యమ నాయకులే తెలంగాణ రాష్ట్రానికి ముఖ్య మంత్రి కావడం తెలంగాణ ప్రజల అదృష్టమని, తెలంగాణ ప్రజలకి ఏంకావాలో కేసీఆర్కు తెలుసన్నారు. 2014, 2018 ఎలక్షన్స్ మేనిఫెస్టోలో ప్రవేశ పెట్టిన అంశాలే కాకుండా తెలంగాణ ప్రజల అభివృద్ధి, సంక్షేమానికి ఎన్నో కొత్త పథకాలు బీఆర్ఎస్ పార్టీ తీసుకొచ్చిందని గుర్తుచేసారు.
బీఆర్ఎస్ పార్టీకి ఎలక్షన్స్ కన్నా తెలంగాణ ప్రజల అభివృద్ధి, సంక్షేమమే ముఖ్యమని పేర్కొన్నారు. చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఎన్నారై బీఆర్ఎస్ యూకే రాష్ట్రమంతటా ప్రత్యేక ప్రచారం నిర్వహిస్తుందని తెలియజేశారు. కేసీఆర్ను సీట్లతో గెలిపించుకుంటామని ధీమా వక్తం చేసారు. ఇప్పటికే ఎన్నారై బీఆర్ఎస్ యూకే సోషల్ మీడియా ద్వారా ఎన్నికల ప్రచారం చేస్తుందని, రానున్న రోజుల్లో క్షేత్రస్థాయిలో ఉధృతంగా ప్రచారం నిర్వహిస్తుందని అశోక్ తెలిపారు.