హైదరాబాద్, ఫిబ్రవరి 1 (నమస్తే తెలంగాణ): సీపీ సజ్జనార్ ఖబడ్దార్.. నన్నే ఏమీ చేయలేకపోయావ్.. ఇంకా కేసీఆర్ను ఏం చేస్తావ్? అని మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్రెడ్డి ప్రశ్నించారు. తెలంగాణ జాతిపిత కేసీఆర్ను విచారణల పేరుతో అవమానిస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. తెలంగాణ భవన్లో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు.
డీజీపీ కావాలని సజ్జనార్ కలలు కంటున్నారని, కర్ణాటకలో కాంగ్రెస్ తరఫున ఎంపీగా పోటీ చేయాలని సజ్జనార్ ప్రయత్నం చేయలేదా? అని ప్రశ్నించారు. పింక్బుక్లో సజ్జనార్ నంబర్-1లో ఉంటారని, సజ్జనార్ కర్ణాటక పోయినా, ఫుణె పోయినా, ఎంపీ అయినా తాము వదిలిపెట్టబోమని హెచ్చరించారు.
కేసీఆర్కు నోటీసులు ఇచ్చి విచారణ చేయడం అంటే బ్రిటీష్ వాళ్లపై పోరాడి స్వా తంత్య్రం తెచ్చిన గాంధీకి నోటీసులు ఇవ్వడమన్నట్టుగా అభివర్ణించారు. కేసీఆర్ తెలంగాణ రాష్ర్టాన్ని సాధించడం వల్లే పీసీసీ చీఫ్ మహేశ్కుమార్గౌడ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఇద్దరూ అధ్యక్షులు అయ్యారని గుర్తుచేశారు.
తెలంగాణలో దోచుకున్న సొమ్ముతో సీపీ సజ్జనార్ కర్ణాటకలో మాల్స్ కట్టారని బీఆర్ఎస్ నేత కురువవిజయ్ ఆరోపించారు. సజ్జనార్ హుబ్లీ నుంచి కాంగ్రెస్ తరఫున ఎంపీగా పోటీ చేయాలని భావిస్తున్నారని తెలిపారు.
బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక సజ్జనార్ పార్లమెంట్కు వెళ్లినా రప్పా, రప్పా గుంజుకొని వస్తామని హెచ్చరించారు. పోలీసులను కంట్రోల్లో పెట్టుకోవాలని డీజీపీకి సూచించారు.