హైదరాబాద్, సెప్టెంబర్ 3: జమిలి ఎన్నికలతో సమాఖ్యవాదం, బహుళ పార్టీ పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి ముప్పు పొంచి ఉందని ఏఐఎంఐఎం పార్టీ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తెలిపారు.
జమిలిపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చిందని, కమిటీ ఏర్పాటు అనేది ఓ ఫార్మాలిటీ మాత్రమేనని పేర్కొన్నారు. ఐదు రాష్ర్టాల ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కేంద్రం గ్యాస్ ధరలను తగ్గించిందని విమర్శించారు.