హైదరాబాద్, సెప్టెంబర్ 23 (నమస్తే తెలంగాణ): కోర్టు అనుమతితోనైనా మల్టిజోన్-2 పరిధిలోనూ ఉపాధ్యాయ పదోన్నతులు కల్పించాలని తెలంగాణ ఉపాధ్యాయ సంఘం (తపస్) కోరింది. టీచర్ల పదోన్నతులపై హైకోర్టు స్టే విధించినందున అనుమతి పొందాలని కోరింది.
ఎమ్మెల్సీ ఏవీఎన్ రెడ్డి, తపస్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు హన్మంతరావు, నవాత్ సురేశ్ శనివారం విద్యాశాఖ మంత్రి సబిత, విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణకు వినతిపత్రాలు సమర్పించారు. 8 ఏండ్ల తర్వాత టీచర్లకు పదోన్నతుల అవకాశం వచ్చిందని తెలిపారు. పండిట్లు, పీఈటీలకూ ఇదే షెడ్యూల్లో పదోన్నతులు కల్పించాలని వారు కోరారు.