హైదరాబాద్, జూన్ 12 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న నూతన సెక్రటేరియేట్ హరితభవనాల నిర్మాణాల సరసన చేరిందని రోడ్లు, భవనాలశాఖమంత్రి వేముల ప్రశాంత్రెడ్డి పేర్కొన్నారు. ఆకుపచ్చని పందిరిలా స్టేట్ ది ఆర్ట్గా 278 అడుగుల పొడవైన నూతన సచివాలయం సీఐఐ ఇండియన్ గ్రీన్బిల్డింగ్ కౌన్సిల్లో నమోదు చేసుకున్నదన్నారు. శనివారం జరిగిన వర్చువల్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ నూత న సచివాలయం బహుళ ప్రత్యేక లక్షణాలను కలిగి ఉందని, ర్యావరణహితంగా దీన్ని నిర్మిస్తున్నామని అన్నారు. సంప్ర దాయ భవనాలతో పోలిస్తే కనీసం 30 నుంచి 50% శక్తి పొదుపు, నీటి వినియోగం 20-30% వరకు మాత్రమే ఉంటుందని ఆయన వివరించారు. అద్భుతమైన డే లైటింగ్, 50% కంటే ఎక్కువ గ్రీన్కవర్ ప్రాంతం, ఎల్ఈడీ లైట్ల వాడకం, రెయిన్వాటర్ హార్వెస్టింగ్ పిట్స్, బిందు, స్ప్రింక్లర్ ఇరిగేషన్ వ్యవస్థ ఈ ప్రాజెక్టులో అమలు చేస్తున్నట్టు వివరించారు.