హైదరాబాద్, సెప్టెంబర్ 27 (నమస్తే తెలంగాణ): సీఎం కేసీఆర్ పాలనలోనే ఆర్యవైశ్యులకు సముచిత గౌరవం, గుర్తింపు లభించిందని పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ గుప్తా పేర్కొన్నారు. 75 ఏండ్ల చరిత్రలో ఆర్యవైశ్యులకు రాని గుర్తింపు, స్వరాష్ట్రం వచ్చిన తొమ్మిదేండ్లలోనే వచ్చిందని ఒక ప్రకటనలో పేరొన్నారు. ఉమ్మడి పాలనలో ఆర్యవైశ్యులను కరివేపాకు మాదిరిగా వాడుకొని, ఎన్నో అవమానాలకు గురిచేశారని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రంలోని అన్ని వర్గాలతో సమానంగా ఆర్యవైశ్యులను కూడా అకున చేర్చుకున్న కేసీఆర్, ఆర్యవైశ్యుల ఆత్మాభిమానానికి ప్రాధాన్యం ఇచ్చారని స్పష్టం చేశారు. ఉప్పల్ భగాయత్లో ఆర్యవైశ్యభవన్కు ఐదెకరాల భూమి ఇచ్చిన మానవతావాది కేసీఆర్ అని ప్రశంసించారు.
రాజకీయంగానూ ఆర్యవైశ్యలకు సీఎం కేసీఆర్ పదవులు ఇచ్చారని దామోదర్ గుప్తా గుర్తు చేశారు. నలుగురికి స్టేట్ కార్పొరేషన్ చైర్మన్ పదవులు, 11 మంది కి మున్సిపల్ చైర్మన్, ఐదు వైస్ చైర్మన్, ఐదు మారె ట్ కమిటీ చైర్మన్, ఒకరికి ఎమ్మె ల్సీ, మరొకరికి ఎమ్మె ల్యే పదవులు వచ్చాయని చెప్పారు. ఆర్యవైశ్య సామాజికవర్గానికి చెందిన మహిళను హైదరాబాద్ మారెట్ కమిటీ చైర్మన్గా నియమించి, ఆర్యవైశ్య సామాజికవర్గానికి పెద్దపీట వేశారని వివరించారు.
రైస్మిల్లు వ్యాపారంలో అత్యధికంగా ఆర్యవైశ్యులే ఉన్నారని, తెలంగాణ ప్రభుత్వ హయాంలోనే రైస్ మిల్లులు కళకళలాడుతున్నాయని దామోదర్ గుప్తా పేర్కొన్నారు. వ్యవసాయానికి సీఎం కేసీఆర్ అధిక ప్రాధాన్యం ఇవ్వడంతో పంటలు సమృద్ధిగా పండుతున్నాయని, దీంతో ధాన్యం ఉత్పత్తి పెరిగి రైస్ మిల్లులు ప్రస్తుతం బిజీగా మారాయని చెప్పారు. ఆర్యవైశ్య సామాజికవర్గానికి బాసటగా నిలిచిన కేసీఆర్కు ప్రతి ఒకరూ అండగా నిలిచి, బీఆర్ఎస్ హ్యాట్రిక్ విజయానికి కృషి చేయాలని దామోదర్ విజ్ఞప్తిచేశారు.