కమ్మర్పల్లి, ఆగస్టు 16: పసుపు బోర్డు తెస్తానని బాండ్ పేపర్ రాసిచ్చి ఎంపీగా గెలిచిన ధర్మపురి అర్వింద్.. మాట తప్పడంతో రైతుల్లో నెలకొన్న అసంతృప్తి ఎక్కడికక్కడ వ్యక్తమవుతూనే ఉన్నది. బోర్డు తెచ్చేదాక గ్రామాల్లోకి రానీయకుండా అడ్డుకొంటూ నిరసనలు తెలుపుతున్న రైతులు చివరకు రైతు పేరిట మంగళవారం నిజామాబాద్ జిల్లా వేల్పూర్ ఎక్స్ రోడ్డు వద్ద అర్వింద్ తలపెట్టిన ధర్నాకు రాకుండా విముఖతను చాటారు. ఎంపీ అర్వింద్, ఎమ్మెల్యే రఘునందన్రావు ధర్నా స్థలికి చేరుకొని.. ప్రసంగాలు పూర్తి చేసే దాకా అరకొర మంది రైతులు, అందులో కార్యకర్తలతోనే కార్యక్రమం సాగింది.